చేపాక్‌ ఎన్నికల ఇన్‌చార్జిగా ఖుష్బూ

ABN , First Publish Date - 2020-12-17T17:27:47+05:30 IST

వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకుగాను

చేపాక్‌ ఎన్నికల ఇన్‌చార్జిగా ఖుష్బూ

చెన్నై : వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలకుగాను బీజేపీ నియోజక వర్గాలకు కొత్త ఎన్నికల ఇన్‌చార్జులను నియమించింది. ఆ మేరకు చేపాక్‌-ట్రిప్లికేన్‌ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల ఇన్‌చార్జిగా ప్రముఖ సినీనటి ఖుష్బూను నియమించారు. రాష్ట్రంలోని 234 అసెంబ్లీ నియోజక వర్గాలకు నియమించిన ఎన్నికల ఇన్‌చార్జిల జాబితాను ఆ పార్టీ రాష్ట్ర శాఖ బుధవారం విడుదల చేసింది. ఇదే విధంగా టి.నగర్‌ నియోజకవర్గానికి సీనియర్‌ నాయ కుడు హెచ్‌. రాజా, ఆలందూరుకు కేటీ రాఘవన్‌, మదురవాయల్‌కు శేషాద్రి, అంబత్తూరుకు లతా రుక్మాంగదన్‌, చెన్నై హార్బర్‌ నియోజకవర్గానికి వినోద్‌ సెల్వం,చెన్నై థౌజెండ్‌లైట్స్‌కు విజయా నంద్‌ రాజన్‌, విల్లివాక్కంకు తంగమనోహరన్‌, ఎగ్మూరుకు అఖిలా సంపత్‌ ఎన్నికల ఇన్‌చార్జిలుగా నియమితులయ్యారు.


 అన్నానగర్‌కు సురేష్‌కుమార్‌, వేళచ్చేరికి డాల్ఫిన్‌ శ్రీధర్‌, పెరంబూరుకు దక్షిణామూర్తి, కొళత్తూరుకు కోదండన్‌, ఏఎన్‌ఎస్‌ ప్రసాద్‌, తిరువికానగర్‌కు ఏళుమలై, తిరు వొత్తియూరుకు పాల్‌ కనకరాజ్‌, ఆర్కేనగర్‌కు వెంకటరామన్‌, రాయపురానికి నాగరాజ్‌, పూందమల్లికి శ్రీనివాసన్‌, విరుగంబాక్కంకు సుధాకర్‌, సైదాపేటకు బాలసుబ్రమణియన్‌, ఆవడికి ఆర్‌ శీనివాసన్‌ ఎన్నికల ఇన్‌చార్జిలుగా నియమితులయ్యారు.

Updated Date - 2020-12-17T17:27:47+05:30 IST