ఢిల్లీ పోలీసులకు కిషన్రెడ్డి పీపీఈ కిట్ల పంపిణీ
ABN , First Publish Date - 2020-05-18T08:51:01+05:30 IST
కరోనా నుంచి రక్షణ కోసం ఢిల్లీ పోలీసులకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి ఆదివారం వ్యక్తిగత భద్రత పరికరాలు(పీపీఈ), శానిటైజర్లు పంపిణీ చేశారు. ఢిల్లీలోని ది హేన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో...

న్యూఢిల్లీ/హైదరాబాద్, మే17(ఆంధ్రజ్యోతి): కరోనా నుంచి రక్షణ కోసం ఢిల్లీ పోలీసులకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్రెడ్డి ఆదివారం వ్యక్తిగత భద్రత పరికరాలు(పీపీఈ), శానిటైజర్లు పంపిణీ చేశారు. ఢిల్లీలోని ది హేన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన ఓ కార్యక్రమంలో 1,100 పీపీఈ కిట్లు, 5,500 లీటర్ల శానిటైజర్లను వారికి అందజేశారు. కరోనా కట్టడికి భారత ప్రజలు సహకరిస్తున్నందుకు కిషన్రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. లాక్డౌన్ నిబంధనలను అమలు చేయడంలో పోలీసులు అందిస్తున్న సేవలను ఆయన ప్రశంసించారు. కాగా, తప్పనిసరి పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా లాక్డౌన్ పొడిగించాల్సి వచ్చిందని ఓ ప్రకటనలో ఆయన అన్నారు. కరోనా పాజిటివ్ కేసులు, మరణాలు పెరుగుతున్నాయని చెప్పారు.