నెలకి సరిపడా నిత్యావసరాలతో ట్రాక్టర్ ట్రాలీలపై ఢిల్లీకి రైతులు

ABN , First Publish Date - 2020-12-06T15:36:20+05:30 IST

నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దేశరాజధాని ఢిల్లీలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు.

నెలకి సరిపడా నిత్యావసరాలతో ట్రాక్టర్ ట్రాలీలపై ఢిల్లీకి రైతులు

న్యూఢిల్లీ: నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు దేశరాజధాని ఢిల్లీలో ఆందోళనలు నిర్వహిస్తున్నారు. కేంద్రప్రభుత్వం రైతులను పలు విధాలుగా బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ రైతులు తమ ఆందోళనను విరమించడం లేదు. దీనికితోడు ఢిల్లీలో రైతుల ఆందోళనకు మద్దతుగా వివిధ రాష్ట్రాల రైతులు కూడా ఢిల్లీకి చేరుకుంటున్నారు. తాజాగా బిజ్నోర్, ముజఫ్ఫర్ నగర్, షామ్లీ, మీరట్ తదితర జిల్లాలకు చెందిన వందలాదిమంది రైతులు ఢిల్లీకి చేరుకున్నారు. దీనికితోడు డిసెంబరు 8న భారత్ బంద్‌కు వీరంతా మద్దతు పలుకుతున్నారు. శనివారం రైతు నేతలు, ప్రభుత్వం మధ్య చర్చలు విఫలమైన నేపధ్యంలో రైతులు తమ ఆందోళనను మరింత ముమ్మరం చేశారు. దీనికి మద్దతుగా పలు ప్రాంతాల నుంచి రైతులు ట్రాక్టర్ ట్రాలీలతో నిత్యవసరాలు తీసుకుని, ఢిల్లీకి పయనమవుతున్నారు.

Updated Date - 2020-12-06T15:36:20+05:30 IST