మద్యం రేట్లు పెంచిన కేరళ ప్రభుత్వం

ABN , First Publish Date - 2020-05-13T23:03:42+05:30 IST

తమ రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మద్యం రకాల్ని బట్టి 10 శాతం నుంచి 35 శాతం వరకు ఈ పెంపు ఉండనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కొద్ది రోజుల క్రితమే మద్యం అమ్మకాలకు పచ్చ జెండా ఊపిన ప్రభుత్వం

మద్యం రేట్లు పెంచిన కేరళ ప్రభుత్వం

తిరువనంతపురం: తమ రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతున్నట్లు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. మద్యం రకాల్ని బట్టి 10 శాతం నుంచి 35 శాతం వరకు ఈ పెంపు ఉండనున్నట్లు ప్రభుత్వం తెలిపింది. కొద్ది రోజుల క్రితమే మద్యం అమ్మకాలకు పచ్చ జెండా ఊపిన ప్రభుత్వం.. కాస్త ఆలస్యంగానే ధరలు పెంచింది. లాక్‌డౌన్‌లో మూతపడ్డ మద్యం షాపులకు తెలుగు రాష్ట్రాల్లో అనుమతి ఇస్తూనే మద్యం రేట్లను పెంచాయి ఇక్కడి స్థానిక ప్రభుత్వాలు. కరోనా లాక్‌డౌన్ వల్ల ఈ చర్య ప్రభుత్వానికి కాస్త లాభదాయకం అయ్యుండొచ్చు అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇదే నేపధ్యంలో కేరళ కూడా ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి మద్యంపై ధరలను పెంచినట్లు చెప్పుకుంటున్నారు. 

Updated Date - 2020-05-13T23:03:42+05:30 IST