నలుగురు కేదార్నాథ్ యాత్రికుల గల్లంతు... మూడు బృందాల వెదుకులాట!
ABN , First Publish Date - 2020-07-16T10:54:24+05:30 IST
కేదార్నాథ్: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్ సందర్శనకు వచ్చిన నలుగురు యాత్రికులు తప్పిపోయారు. వీరు కేదార్నాథ్ ధామ్ నుంచి వాసుకీతాల్...
కేదార్నాథ్: ఉత్తరాఖండ్లోని కేదార్నాథ్ ధామ్ సందర్శనకు వచ్చిన నలుగురు యాత్రికులు తప్పిపోయారు. వీరు కేదార్నాథ్ ధామ్ నుంచి వాసుకీతాల్-త్రియుగీనారాయణ్కు నడకమార్గాన వెళ్లారు. తప్పిపోయిన ఈ నలుగురు యాత్రికుల ఆచూకీ తెలుసుకునేందుకు మూడు బృందాలు అడవిలో వెదుకులాట ప్రారంభించాయి. ఇందుకోసం హెలికాప్టర్ సాయం కూడా తీసుకుంటున్నారు. అయితే ఈ ప్రాంతంలో కురుస్తున్న వర్షానికి తోడు దట్టమైన పొగమంచు కారణంగా వెదుకులాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఇప్పటివరకు వీరి జాడ తెలియరాలేదు. పోలీస్, ఎస్డిఆర్ఎఫ్, లోకల్ గైడ్స్... ఈ మూడు బృందాలు అడవిలో రెండు రోజులుగా గాలింపు చర్యలు నిర్వహిస్తున్నాయి. జూలై 13న డెహ్రాడూన్, నైనితాల్ జిల్లాకు చెందిన హిమాన్షు గురుంగ్, హర్ష్ భండారి, మోహిత్ భట్, జగదీష్ భట్ కేదార్నాథ్ వెళ్లారు. తరువాత వారు వాసుకీతాల్-త్రియుగీనారాయణ్కు కాలిబాటన వెళ్లారు. రెండు రోజులు గడిచినా ఈ నలుగురు రాకపోవడంతో వీరితోపాటు అంతకుముందు కేదార్నాథ్ వెళ్లిన సోన్... ప్రయాగ్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం గల్లంతయిన ఆ నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.