మరో కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక సర్కారు

ABN , First Publish Date - 2020-12-20T01:38:25+05:30 IST

మరో కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక సర్కారు

మరో కీలక నిర్ణయం తీసుకున్న కర్ణాటక సర్కారు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పాఠశాలను తిరిగి ప్రారంభిస్తున్నట్లు కర్ణాటక ప్రభుత్వం పేర్కొంది. జనవరి 1 నుంచి 10, 12 తరగతుల పాఠశాలలను తిరిగి ప్రారంభిస్తామని ప్రభుత్వం వెల్లడించింది. మూసివేసిన పాఠశాలలు, ప్రీ-యూనివర్శిటీ కళాశాలలను తిరిగి తెరవాలని కర్ణాటక ప్రభుత్వం శనివారం నిర్ణయించింది.


6 నుంచి 9 తరగతులకు విద్యగమ కార్యక్రమం జనవరి 1 నుంచి ప్రారంభమవుతుందని, "విద్యాగమ కింద తరగతులకు తప్పనిసరిగా హాజరుకావాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి సుధాకర్ అన్నారు. కరోనా వైరస్ కారణంగా కొన్ని నెలలపాటు పాఠశాలలు మూసివేశారు.

Updated Date - 2020-12-20T01:38:25+05:30 IST