కర్ణాటకలో 8000కు చేరువైన కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-06-19T01:05:33+05:30 IST

కర్ణాటకలో నేడు 200కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీతో రాష్ట్రంలో మొత్తం కేసులు 8000కు చేరువయ్యాయి. తాజా కేసులకు...

కర్ణాటకలో 8000కు చేరువైన కరోనా కేసులు

బెంగళూరు: కర్ణాటకలో నేడు 200కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 8000కు చేరువయ్యాయి. తాజా కేసులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 210 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 12 మంది ప్రాణాలు కోల్పోయారు. 179మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కొత్తగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7,944కి చేరింది. వీరిలో 2,843మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 4,983 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 114 మంది ప్రాణాలు కోల్పోయారు.

Updated Date - 2020-06-19T01:05:33+05:30 IST