కర్ణాటకలో పెరిగిన కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-05-17T21:24:27+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది.
![కర్ణాటకలో పెరిగిన కరోనా కేసులు](https://media.andhrajyothy.com/appimg/galleries/2020051703525855/05172020155418n31.gif)
బెంగళూరు: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కోవిడ్-19 కట్టడి చర్యల్లో భాగంగా లాక్ డౌన్ నిబంధనలను రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా అమలు చేస్తోంది. అయినప్పటికీ రోజురోజుకూ కర్ణాటకలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఆదివారం మధ్నాహ్నానికి కొత్తగా మరో 54 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ ప్రకటించింది. ఆదివారం కరోనా వల్ల ఒకరు మృతి చెందగా.. ఇప్పటి వరకు మొత్తం 37 మంది కరోనాతో చనిపోయారని ప్రభుత్వం తెలిపింది. మొత్తం 1,146 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా నుంచి కోలుకొని 497 మంది డిశ్చార్జ్ అయినట్లు వైద్య శాఖ తెలిపింది.