కరోనాపై యుద్ధం.. మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్న సీఎం

ABN , First Publish Date - 2020-03-13T21:32:38+05:30 IST

కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే.

కరోనాపై యుద్ధం.. మాస్టర్ ప్లాన్ రూపొందిస్తున్నామన్న సీఎం

బెంగళూరు:  కోవిడ్-19(కరోనా వైరస్) ప్రభావంతో దేశవ్యాప్తంగా ఆందోళనలు నెలకొన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీ, మధ్యప్రదేశ్‌, కేరళ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. ముందస్తు చర్యల్లో భాగంగా పకడ్బందీ ప్రణాళికతో అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. తాజాగా ఈ జాబితాలో కర్ణాటక చేరింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రయాణాలు మానుకోవాలని కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప పిలుపునిచ్చారు. వారం రోజుల పాటు యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నట్టు ప్రకటించారు. శనివారం నుంచి మాల్స్, థియేటర్స్, స్కూళ్ళు, కాలేజీలు పూర్తిగా మూసేయాలని సీఎం ఆదేశించారు. ఒడిషా ప్రభుత్వం కూడా అలర్ట్ అయ్యింది. ఈ నెల 31 వరకు స్కూల్స్, కాలేజీలు బంద్ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 74 కరోనా పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా 17 కేసులతో కేరళ తొలి స్థానంలో ఉంది. 

Updated Date - 2020-03-13T21:32:38+05:30 IST