లండన్ వెళ్లేముందు కనికా ఏం చేసిందంటే...

ABN , First Publish Date - 2020-03-24T17:30:23+05:30 IST

బాలీవుడ్ గాయని కనికా కపూర్ గత కొన్నివారాలుగా వార్తల్లో నానుతున్నారు. లండన్ నుంచి వచ్చిన కనికా కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే ఆమె ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా...

లండన్ వెళ్లేముందు కనికా ఏం చేసిందంటే...

బాలీవుడ్ గాయని కనికా కపూర్ గత కొన్నివారాలుగా వార్తల్లో నానుతున్నారు. లండన్ నుంచి వచ్చిన కనికా కరోనా వైరస్ బారిన పడ్డారు. అయితే ఆమె ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా పలు పార్టీలలో పాల్గొంటూ సుమారు 400 మందిని  కలుసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో ఆమెపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాగా కనికా కపూర్ లండన్ వెళ్లకముందు ప్రముఖ సంగీత దర్శకుడు బప్పీలహరిని కలుసుకున్నారు. ఆయనతోపాటు ఒక పాటను రికార్డు చేశారు. దీని గురించి బప్పీలహరి మాట్లాడుతూ కనికా లండన్ వెళ్లకముందు ‘ప్యార్ మే థోడా ట్విస్ట్’ సినిమా కోసం ఒక పాట పాడారని తెలిపారు. కనికా సభ్యత, సంస్కారం కలిగిన మహిళ అని, ఆమె త్వరలోనే అనారోగ్యం నుంచి కోలుకుంటారని భావిస్తున్నానని అన్నారు.

Read more