విచారణకు జస్టిస్‌ నారిమన్‌ దూరం

ABN , First Publish Date - 2020-08-20T07:41:36+05:30 IST

మూడు రాజధానుల కేసు విచారణ నుంచి మరో సుప్రీంకోర్టు న్యాయమూర్తి వైదొలిగారు. ఈ పిటిషన్‌ను విచారించే ధర్మాసనం నుంచి జస్టిస్‌ రోహింటన్‌ ఫాలీ నారిమన్‌ తప్పుకోవడంతో విచారణ వాయిదా పడింది...

విచారణకు జస్టిస్‌ నారిమన్‌ దూరం

న్యూఢిల్లీ : మూడు రాజధానుల కేసు విచారణ నుంచి మరో సుప్రీంకోర్టు న్యాయమూర్తి వైదొలిగారు. ఈ పిటిషన్‌ను విచారించే ధర్మాసనం నుంచి జస్టిస్‌ రోహింటన్‌ ఫాలీ నారిమన్‌ తప్పుకోవడంతో విచారణ వాయిదా పడింది.  ఈ నెల 28వ తేదీన మరో ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టే అవకాశం ఉంది.

Updated Date - 2020-08-20T07:41:36+05:30 IST