బీజేపీ నేత కుటుంబం ఊచకోత.. 8 మంది సెక్యూరిటీ సిబ్బంది అరెస్ట్
ABN , First Publish Date - 2020-07-09T04:26:18+05:30 IST
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో బీజేపీ నేత వసీం బారి కుటుంబాన్ని ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటనలో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో బీజేపీ నేత వసీం బారి కుటుంబాన్ని ఉగ్రవాదులు కాల్చి చంపిన ఘటనలో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. మొత్తం 8 మంది రక్షణ సిబ్బంది ఉన్నా ఘటనా సమయంలో ఒక్కరూ లేకపోవడం అనుమానాలు రేకెత్తిస్తోంది. వసీం బారి కుటుంబాన్ని పథకం ప్రకారం కుట్రపూరితంగా కాల్చిచంపారని జమ్మూకశ్మీర్ మాజీ డిప్యూటీ సీఎం నిర్మల్ సింగ్ ఆరోపించారు.
మరోవైపు వసీం బారికి రక్షణ కల్పిస్తోన్న మొత్తం 8 మంది రక్షణ సిబ్బందిని అరెస్ట్ చేసి విచారణ జరుపుతున్నారు. బండిపోరా జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడైన వసీం బారిని, ఆయన తండ్రిని, సోదరుడిని రాత్రి 9 గంటల సమయంలో ఉగ్రవాదులు కాల్చిచంపారు. వసీం బారి దుకాణం వద్ద ఈ ఘటన జరిగింది. వసీం బారి దుకాణం సరిగ్గా పోలీస్ స్టేషన్కు ఎదురుగానే ఉంటుంది.