బీజేపీపై జేడీయూ నేత త్యాగి ఫైర్!

ABN , First Publish Date - 2020-12-27T23:14:28+05:30 IST

తమ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంపై జేడీయూ నేత కేసీ త్యాగి అసహనం వ్యక్తం చేశారు. కూటమి రాజకీయాల్లో సరైన పద్ధతి కాదని, ఇలాంటివాటిని తాము ఆమోదించమని త్యాగి అన్నారు. దేశ రాజకీయాలు, జేడీయూ భవిష్యత్తు వంటి...

బీజేపీపై జేడీయూ నేత త్యాగి ఫైర్!

పాట్నా: తమ పార్టీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంపై జేడీయూ నేత కేసీ త్యాగి అసహనం వ్యక్తం చేశారు. కూటమి రాజకీయాల్లో సరైన పద్ధతి కాదని, ఇలాంటివాటిని తాము ఆమోదించమని త్యాగి అన్నారు. దేశ రాజకీయాలు, జేడీయూ భవిష్యత్తు వంటి అంశాలపై కొద్ది సేపటి క్రితం జేడీయూ పార్టీ ఎగ్జిక్యూటివ్ సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన త్యాగి ఈ వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీకి చెందిన ఆరుగురు ఎమ్యెల్యేల బీజేపీ తమలో చేర్చుకోవడాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉంటే ఈ సమావేశంలో భాగంగా పార్టీ అధ్యక్ష పదవికి కొత్త నేతను ఎంపికచేశారు. 2019లో ఎన్నికైన నితీశ్ పదవీకాలం పూర్తవడంతో ఈ రోజు తప్పుకున్నారు. కొత్త అధ్యక్షుడిగా పార్టీ జనరల్ సెక్రటరీ ఆర్సీపీ సింగ్‌‌ను ఎంపిక చేశారు.

Updated Date - 2020-12-27T23:14:28+05:30 IST