జమ్మూకాశ్మీర్ లో 1071 మందికి కరోనా పరీక్షలు.. అందులో పాజిటివ్ కేసులు..
ABN , First Publish Date - 2020-04-26T00:01:49+05:30 IST
జమ్మూకాశ్మీర్ లో కొత్తగా శనివారం మరో 40 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది.

శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ లో కొత్తగా శనివారం మరో 40 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 1071 మంది కరోనా పరీక్షలు చేయగా.. అందులో 40 మందికి కోవిడ్-19 పాజిటివ్ వచ్చినట్లు ప్రభుత్వం వెల్లడించింది. కరోనా వల్ల 6 మంది చనిపోయారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. జమ్మూలో 57 కరోనా వైరస్ కేసులు నమోదవగా.. కాశ్మీర్ లో 437 కరోనా కేసులు నమోదయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొత్తం 494 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్ నియంత్రణకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. కరోనా వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మే 3వ తేదీ వరకు లాక్ డౌన్ పొడిగించినట్లు ప్రకటించింది.