రైతుల విషయంలో కేంద్రం అలాంటి భాష ఉపయోగించడం మహాపాపం : ప్రియాంక గాంధీ

ABN , First Publish Date - 2020-12-28T16:32:01+05:30 IST

కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కేంద్రంపై మరోసారి మండిపడ్డారు. రైతుల విషయంలో కేంద్రం వాడుతున్న భాష

రైతుల విషయంలో కేంద్రం అలాంటి భాష ఉపయోగించడం మహాపాపం : ప్రియాంక గాంధీ

న్యూఢిల్లీ : కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కేంద్రంపై మరోసారి మండిపడ్డారు. రైతుల విషయంలో కేంద్రం వాడుతున్న భాష ఏమాత్రం సరిలేదని మండిపడ్డారు. అలాంటి భాష వాడటం మహా పాపమని వ్యాఖ్యానించారు. కేంద్రం రైతులకు కచ్చితంగా జవాబుదారీగా నడుచుకోవాల్సిందేనని ఆమె సూచించారు. కేంద్రం వెంటనే రైతులతో చర్చించాలని ప్రియాంక డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ పార్టీ 136 ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని పార్టీ కార్యాలయంలో సీనియర్ నేత ఏకే ఆంటోనీ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు ఆజాద్, ఖర్గే తదితరులు పాల్గొన్నారు. విదేశాలకు వెళ్లిన కారణంగా రాహుల్, అనారోగ్యం దృష్ట్యా సోనియా ఈ కార్యక్రమానికి హాజరు కాలేదని సమాచారం. 

Updated Date - 2020-12-28T16:32:01+05:30 IST