అది హత్యే.. డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సంచలన వ్యాఖ్య
ABN , First Publish Date - 2020-08-23T01:45:19+05:30 IST
పీపీఈ కిట్ల కొనుగోళ్ల చుట్టూ నెలకొన్ని అవినీతిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఛీఫ్ టెడ్రోస్ అథానమ్ హత్యగా అభివర్ణించారు. అవినీతి కారణంగా వైద్య సిబ్బంది పీపీఈ కిట్లకు దూరమవుతున్నారని తెలిపారు.
జెనీవా: పీపీఈ కిట్ల కొనుగోళ్ల చుట్టూ నెలకొన్న అవినీతిని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అథానమ్ హత్యగా అభివర్ణించారు. అవినీతి కారణంగా వైద్య సిబ్బంది పీపీఈ కిట్లకు దూరమవుతున్నారని తెలిపారు. దీని వల్ల వారే కాకుండా పేషెంట్లు కూడా ప్రమాదంలో పడుతున్నారని ఆయన తేల్చిచెప్పారు. ‘పీపీఈ కిట్లు లేకపోతే వైద్య సిబ్బంది ప్రమాదంలో పడతారు. వారి సేవలను పొందేవారు కూడా ప్రమాదాన్ని ఎదుర్కొంటారు. ఇది కచ్చితంగా నేరమే.. హత్యే.. దీనికి ముగింపు పలకాల్సిందే’ అని ఆయన వ్యాఖ్యానించారు. దక్షిణాఫ్రియాలో పీపీకిట్ల పంపిణీలో నెలకొన్న అవినీతిపై ఆయన ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. అవినీతి ఏ రూపంలో ఉన్నా ఆమోదయోగ్యం కాదన్న ఆయన..పీపీఈ కిట్ల విషయంలో అవినీతి మాత్రం హత్యా నేరంతో సమానమని వ్యాఖ్యానించారు.