గ్యాంగ్‌స్టర్ దూబే అనుచరుడి ఆస్తులపై ఐటీ దర్యాప్తు

ABN , First Publish Date - 2020-07-28T14:04:32+05:30 IST

కాన్పూర్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే పారిపోయేందుకు మూడు లగ్జరీ కార్లను సమకూర్చిన అతని సన్నిహిత అనుచరుడు జైకాంత్ బాజ్‌పాయ్ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ(ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విభాగాలు ఆరా ...

గ్యాంగ్‌స్టర్ దూబే అనుచరుడి ఆస్తులపై ఐటీ దర్యాప్తు

లక్నో (ఉత్తరప్రదేశ్): కాన్పూర్ గ్యాంగ్ స్టర్ వికాస్ దూబే పారిపోయేందుకు మూడు లగ్జరీ కార్లను సమకూర్చిన అతని సన్నిహిత అనుచరుడు జైకాంత్ బాజ్‌పాయ్ ఆస్తులపై ఆదాయపు పన్ను శాఖ(ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విభాగాలు ఆరా తీస్తున్నాయి. బిక్రూ గ్రామంలో 8మంది పోలీసులను హతమార్చిన తర్వాత వికాస్ దూబే పారిపోయేందుకు జైకాంత్ బాజ్ పాయ్ 3 లగ్జరీ కార్లను సమకూర్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దీంతో యూపీ సర్కారు వికాస్ దూబే సన్నిహితుడైన జైకాంత్ బాజ్ పాయ్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని ఐటీ,ఈడీలకు ఫిర్యాదు చేసింది. సర్కారు చేసిన ఫిర్యాదుతో ఐటీ, ఈడీ అధికారులు దాడులు చేసి జైకాంత్ బాజ్ పాయ్ ఆస్తులను సీజ్ చేశారు. పోలీసులను హతమార్చాక దూబే బాజ్ పాయ్ కు ఫోన్ చేయగా, అతనికి రూ.2లక్షల నగదు, 25 తూటాలతో రివాల్వరు, 3 లగ్జరీ కార్లను సమకూర్చాడని పోలీసుల దర్యాప్తులో తేలింది. దూబే అనుచరుడైన బాజ్ పాయ్  ఉన్నట్టుండి కోట్లాదిరూపాయల ఆస్తులు కూడబెట్టారని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

Updated Date - 2020-07-28T14:04:32+05:30 IST