అసోంలో కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు
ABN , First Publish Date - 2020-12-27T09:56:06+05:30 IST
అసోం కేంద్రంగా పని చేస్తున్న ముగ్గురు ప్రముఖ కాంట్రాక్టర్లపై ఈ వారం ప్రారంభంలో ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహించింది.

రూ.100 కోట్ల నల్లధనం గుర్తింపు
న్యూఢిల్లీ, డిసెంబరు 26: అసోం కేంద్రంగా పని చేస్తున్న ముగ్గురు ప్రముఖ కాంట్రాక్టర్లపై ఈ వారం ప్రారంభంలో ఆదాయ పన్ను శాఖ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా లెక్కల్లో చూపని రూ.100 కోట్ల ఆదాయాన్ని గుర్తించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) శనివారం తెలిపింది. అసోంలోని గువహతి, సిలపతర్, పట్షాల, ఢిల్లీలోని పద్నాలుగు ప్రాంతాల్లో డిసెంబరు 22న సోదాలు, సర్వేను ప్రారంభించిన ట్లు పేర్కొంది. ఈ సందర్భంగా రూ.2.95 కోట్ల నగదును సీజ్ చేసినట్టు తెలిపింది. మొత్తంగా ఇప్పటి వరకు దాదాపు రూ.100 కోట్ల అప్రకటిత ఆదాయాన్ని గుర్తించినట్టు పేర్కొంది.