సింగపూర్ వలస కార్మికులకు 86 లక్షల సాయం
ABN , First Publish Date - 2020-06-23T08:31:56+05:30 IST
సింగపూర్లో కరోనా వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు అక్కడి భారత పరిశ్రమల సమాఖ్య-భారత బిజినెస్ ఫోరం(సీఐఐ-ఐబీఎఫ్) ఆర్థిక సాయం చేసింది...

సింగపూర్, జూన్ 22: సింగపూర్లో కరోనా వల్ల ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న వలస కార్మికులకు అక్కడి భారత పరిశ్రమల సమాఖ్య-భారత బిజినెస్ ఫోరం(సీఐఐ-ఐబీఎఫ్) ఆర్థిక సాయం చేసింది. భారత్తో పాటు దక్షిణాసియా వలస కార్మికులకు సోమవారం రూ.86.60 లక్షలు ప్రకటించింది. సింగపూర్ భారతీయ అభివృద్ధి సమాఖ్యతో పనిచేస్తూ కార్మికుల కోసం సీఐఐ-ఐబీఎఫ్ విరాళాలు సేకరిస్తోంది.