భారత రాయబారికి పాక్‌ సమన్లు

ABN , First Publish Date - 2020-06-22T07:34:31+05:30 IST

సరిహద్దుల వద్ద భారత ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుందని పాకిస్థాన్‌ ఆరోపించింది. పాక్‌లోని భారత రాయబారి గౌరవ్‌ అహ్లువాలియాకు సమన్లు పంపి, తమ కార్యాలయానికి పిలిపించుకుని డీజీ జాహిద్‌ హఫీజ్‌ నిరసన తెలిపారు...

భారత రాయబారికి పాక్‌ సమన్లు

  • ఇండియన్‌ ఆర్మీ కాల్పులకు పాల్పడుతుందని ఆరోపణ


ఇస్లామాబాద్‌, జూన్‌ 21: సరిహద్దుల వద్ద భారత ఆర్మీ కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తుందని పాకిస్థాన్‌ ఆరోపించింది. పాక్‌లోని భారత రాయబారి గౌరవ్‌ అహ్లువాలియాకు సమన్లు పంపి, తమ కార్యాలయానికి పిలిపించుకుని డీజీ జాహిద్‌ హఫీజ్‌ నిరసన తెలిపారు. ఈ నెల 20న హజీపిర్‌, బెదోరీ సెక్టార్ల ప్రాంతాల్లో భారత్‌ జరిపిన కాల్పుల్లో ఒకరు ప్రాణాలు కోల్పోయారని, ఇద్దరికి గాయాలయ్యాయని పాక్‌ చెప్పుకొచ్చింది. 


Updated Date - 2020-06-22T07:34:31+05:30 IST