భారత్లో జూమ్కు భారీ డిమాండ్! ప్రభుత్వం హెచ్చరిస్తున్నా కూడా..
ABN , First Publish Date - 2020-05-09T21:07:31+05:30 IST
వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ విషయంలో భద్రతా పరమైన ప్రశ్నలు తలెత్తినప్పటికీ భారత్లో ఈ యాప్కు ఆదరణ తగ్గలేదని తెలుస్తోంది.
న్యూఢిల్లీ: వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ విషయంలో భద్రతా పరమైన ప్రశ్నలు తలెత్తినప్పటికీ భారత్లో ఈ యాప్కు ఆదరణ తగ్గలేదని తెలుస్తోంది. ఏప్రిల్ నెలలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 13.1 కోట్ల సార్లు వినియోగదారులు ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకోగా అందులో భారత్ నుంచే అత్యధిక డౌన్లోడ్లు జరిగాయని టెక్ సంస్థ సెన్సర్ టవర్ తెలిపింది. యాప్ విషయంలో అప్రమత్తంగా ఉండాలంటూ భారత ప్రభుత్వం హెచ్చరించినప్పటికీ కూడా.. మొత్తం డౌన్లోడ్లలో దాదాపు 18.2 శాతం భారత్లోనే జరిగాయని ఆ సంస్థ తెలిపింది. వర్క్ ఫ్రం హోం అవసరాలు తీర్చుకోవడంతో పాటూ ప్రజలు జూమ్ ద్వారా స్నేహితులు, సన్నహితులతో మాట కలిపారని చెప్పింది. జూమ్తో పాటూ గూగుల్ మీట్పై ప్రజలు అధికంగానే ఆధారపడ్డారంది. ఇక పాపులర్ యాప్ టిక్టాక్ను ప్రపంచవ్యాప్తంగా ప్రజలు 10.7 కోట్ల సార్లు డౌన్లో చేయగా..ఇందులో భారత్ వాటా 22 శాతమని తేలింది.