33 యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్న భారత్‌

ABN , First Publish Date - 2020-06-19T08:13:20+05:30 IST

రష్యా నుంచి కొత్తగా 33 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన(ఐఏఎఫ్‌) సన్నాహాలు చేస్తోంది. వీటిల్లో 21 మిగ్‌-29, 12 సుఖోయ్‌-30ఎంకేఐ ఫైటర్‌ జెట్స్‌ ఉంటాయి...

33 యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్న భారత్‌

  • రష్యా నుంచి 21 మిగ్‌, 12సుఖోయ్‌ జెట్స్‌


న్యూఢిల్లీ, జూన్‌ 18: రష్యా నుంచి కొత్తగా 33 యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు భారత వాయుసేన(ఐఏఎఫ్‌) సన్నాహాలు చేస్తోంది. వీటిల్లో 21 మిగ్‌-29, 12 సుఖోయ్‌-30ఎంకేఐ ఫైటర్‌ జెట్స్‌ ఉంటాయి. ఈ మేరకు సిద్ధం చేసిన ప్రతిపాదనలను వచ్చేవారం రక్షణ శాఖ నేతృత్వంలో జరగనున్న ఉన్నత స్థాయి సమావేశం ముందు పెట్టనుంది. అక్కడ ఆమోదం పొందిన వెంటనే.. వాటిని కొనుగోలు చేయాలని ఐఏఎఫ్‌ నిర్ణయించింది. వీటి విలువ రూ. 6 వేల కోట్లు ఉంటుందని అంచనా. గగనతల యుద్ధంలో బలాన్ని పెంచుకునేందుకు మిగ్‌ విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు వివరించింది. 


Updated Date - 2020-06-19T08:13:20+05:30 IST