గుడ్‌న్యూస్... భారత్‌లో తగ్గుతున్న కరోనా తీవ్రత

ABN , First Publish Date - 2020-11-03T15:39:28+05:30 IST

దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత రోజురోజుకూ తగ్గుముఖం పడుతుండటం కాస్తంత ఊరట కలిగించే విషయం. భారత్‌లో గతంతో పోల్చుకుంటే.. పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య క్రమంగా...

గుడ్‌న్యూస్... భారత్‌లో తగ్గుతున్న కరోనా తీవ్రత

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా తీవ్రత రోజురోజుకూ తగ్గుముఖం పడుతుండటం కాస్తంత ఊరట కలిగించే విషయం. భారత్‌లో గతంతో పోల్చుకుంటే.. పాజిటివ్ కేసులు, మృతుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం గమనార్హం. భారత్‌లో గత 24 గంటల్లో 38,310 కరోనా కేసులు, 490 మంది మృతి చెందినట్లు కేంద్ర వైద్యఆరోగ్య శాఖ వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో కలిపి భారత్‌లో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 82,67,623కి చేరింది.


దేశంలో ప్రస్తుతం 5,41,405 యాక్టివ్‌ కేసులు ఉండగా, 76,03,121 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయినట్లు కేంద్రం తెలిపింది. దేశంలో కరోనాతో ఇప్పటివరకు 1,23,097 మంది మృతి చెందారు. రికవరీ రేటు కూడా భారత్‌లో మెరుగ్గా ఉండటం విశేషం. సోమవారం ఒక్కరోజే 58,323 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా రికవరీ రేటు 91.96 శాతంగా నమోదు కాగా.. మరణాల రేటు 1.49 శాతంగా ఉంది.



Updated Date - 2020-11-03T15:39:28+05:30 IST