బాస్మతి బియ్యం మావే!
ABN , First Publish Date - 2020-12-30T08:53:40+05:30 IST
బాస్మతి బియ్యం మావే!

ఈయూలో భారత్, పాక్ పోటాపోటీ
ఇస్లామాబాద్, డిసెంబరు 29: భారత్, పాకిస్థాన్ మధ్య బాస్మతి బియ్యం కొత్త తగవు పెట్టాయి. బాస్మ తి బియ్యం తమ దేశ ఉత్పత్తేనని, దీనిని అధికారికంగా గుర్తించాలని యూరోపియన్ యూనియన్ (ఈ యూ)లో దరఖాస్తు చేయగా.. పాకిస్థాన్ దీనిని వ్యతిరేకిస్తోంది. బాస్మతి తమ ఉత్పత్తేనని వాదిస్తోంది. కానీ తమ దేశంలో బాస్మతి బియ్యాన్ని స్థానిక ఉత్పత్తిగా గుర్తించలేదు.