చైనా కంటే భారత్ శక్తిమంతంగా ఎదగాలి : మోహన్ భాగవత్

ABN , First Publish Date - 2020-10-25T18:18:43+05:30 IST

భారతదేశం ప్రపంచంలో చైనా కంటే శక్తిమంతంగా ఎదిగి వ్యాపించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్ఎస్) అధ్యక్షుడు మోహన్ భాగవత్ అన్నారు...

చైనా కంటే భారత్ శక్తిమంతంగా ఎదగాలి : మోహన్ భాగవత్

భారతదేశం ప్రపంచంలో  చైనా కంటే శక్తిమంతంగా ఎదిగి వ్యాపించాల్సిన అవసరం ఉందని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్‌ఎస్ఎస్) అధ్యక్షుడు మోహన్ భాగవత్ అన్నారు. విజయదశమి వేడుకగా నాగ్‌పూర్‌లోని ఆర్‌ఎస్ఎస్ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు.

ఆర్‌ఎస్ఎస్ కరసేవకులను ఉద్దేశించి ఆయన ప్రసంగం చేశారు. ఆ ప్రసంగంలో భాగవత్ మాట్లాడుతూ చైనాకు వ్యతిరేకంగా భారత్ సైన్యాన్ని బలోపేతం చేసి సిద్ధంగా ఉండాల్సిన సమయం వచ్చిందన్నారు. ప్రపంచమంతా చైనాకు వ్యతిరేకంగా నిలబడుతోందని అందుకు అమెరికా, తైవాన్, వియెత్నాం దేశాలను ఉదాహరణగా చూపారు. భారత్ అన్ని దేశాలతో స్నేహ భావంతో మెలగాలని, కానీ ఆ స్నేహ భావాన్ని ఇతర దేశాలు బలహీనతగా భావించి దాడి చేస్తే వారికి తగిన బుద్ధి చెప్పాలని ఆయన చెప్పారు.

Updated Date - 2020-10-25T18:18:43+05:30 IST