కరోనాతో ఆర్థిక ప్రగతికి కళ్లెం.. లేదంటే టాప్ 3లోకి భారత్: రాజ్నాథ్
ABN , First Publish Date - 2020-08-11T23:34:55+05:30 IST
దేశంలో కరోనా మహమ్మారి లేకుంటే భారత ఆర్థిక వ్యవస్థ చాలా అభివృద్ధి చెందేదని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు.
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి లేకుంటే భారత ఆర్థిక వ్యవస్థ చాలా అభివృద్ధి చెందేదని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఈ మహమ్మారి లేకుంటే మరో ఏడు-ఎనిమిది సంవత్సరాల్లో ప్రపంచ టాప్ 3 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా నిలిచేదని చెప్పారు. మంచి ఊపుమీదున్న ఆర్థిక ప్రగతికి కరోనా కళ్లెం వేసిందని అభిప్రాయపడ్డారు. ‘కరోనాతో గొప్పగా పోరాటం చేస్తున్నాం. ఇలాగే ఆ తర్వాత ఆర్థిక వ్యవస్థను కూడా గాడిలో పెట్టవచ్చని ఆశిస్తున్నాం’ అని రాజ్నాథ్ పేర్కొన్నారు.