సామాజిక దూరంతో 62% తగ్గుదల: ఐసీఎంఆర్‌

ABN , First Publish Date - 2020-03-25T07:35:35+05:30 IST

సామాజిక దూరం నిబంధనను కఠినంగా అమలయ్యేలా చేస్తే భారత్‌లో కరోనా వ్యాప్తి కేసులను 62 శాతం తగ్గించవచ్చని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు...

సామాజిక దూరంతో 62% తగ్గుదల: ఐసీఎంఆర్‌

న్యూఢిల్లీ, మార్చి 24: సామాజిక దూరం నిబంధనను కఠినంగా అమలయ్యేలా చేస్తే భారత్‌లో కరోనా వ్యాప్తి కేసులను 62 శాతం తగ్గించవచ్చని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) తెలిపింది. కరోనా లక్షణాలు ఉన్న వ్యక్తులు ఇంట్లోనే క్వారంటైన్‌లో ఉండడం వల్ల ఆ వైరస్‌ వ్యాప్తిని నిరోధించవచ్చని ఐసీఎంఆర్‌ సర్వేలో తేలింది. ఇలా చేయడం ద్వారా కరోనాను పూర్తిగా అరిక ట్టడానికి త్వరగా పలు ఆవిష్కరణలు చేసేలా శాస్త్రవేత్తలకు మరిన్ని అవకాశాలు ఇవ్వచ్చని పేర్కొంది. కాగా, కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహించడానికి దేశంలోని 22 ప్రైవేటు ల్యాబరేటరీలు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌)లో రిజిస్ట్రర్‌ చేసుకున్నాయి. ఈ ల్యాబరేటరీలన్నింటికీ దేశ వ్యాప్తంగా 15,500 కేంద్రాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు చెప్పారు. 118 ప్రభుత్వ ల్యాబరేటరీలు ఐసీఎంఆర్‌తో కలిసి కొవిడ్‌-19 పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

Updated Date - 2020-03-25T07:35:35+05:30 IST