భారత్, సింగపూర్ అధికారుల వర్చువల్ సమావేశం.. దౌత్య సంబంధాలపై చర్చ..

ABN , First Publish Date - 2020-12-11T05:22:57+05:30 IST

భారత్, సింగపూర్ అధికారుల వర్చువల్ సమావేశం.. దౌత్య సంబంధాలపై చర్చ..

భారత్, సింగపూర్ అధికారుల వర్చువల్ సమావేశం.. దౌత్య సంబంధాలపై చర్చ..

న్యూఢిల్లీ: భారత్, సింగపూర్ దేశాలకు చెందిన సీనియర్ అధికారులు గురువారం వర్చువల్ మీటింగ్ నిర్వహించారు. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు.. కరోనా అనంతరం అభివృద్ధిపైనా చర్చలు జరిపారు. విదేశీ వ్యవహారాల శాఖ సెక్రటరీ (ఈస్ట్) రివా గంగూలీ, సింగపూర్ విదేశీ వ్యవహారాల సెకండ్ పర్మినెంట్ సెక్రటరీ స్టాన్లీ లోహ్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఏసియన్-భారత్ సంబంధాల పైనా ఈ సంరద్భంగా చర్చ జరిగింది. ఈ మేరకు ఇవాళ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ ట్విటర్లో పేర్కొన్నారు. కాగా ఇంతకు ముందు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆసియా దేశాల రక్షణ మంత్రుల సమావేశం (ఏడీఎంఎం-ప్లస్)లో పాల్గొని వ్యూహాత్మక భద్రతా విధానంపై చర్చలు జరిపారు. బయోటెర్రరిజం, అంటువ్యాధుల ముప్పును పరిష్కరించేందుకు ఆసియా దేశాల రక్షణ మంత్రులు నిరంతర కృషి చేయాల్సిన అవసరం ఉందని రాజ్‌నాథ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

Updated Date - 2020-12-11T05:22:57+05:30 IST