పీవోకే జనాభా సరళి మార్చేశారు
ABN , First Publish Date - 2020-09-29T08:09:15+05:30 IST
భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన తారస్థాయిలో ఉందంటూ పాకిస్థాన్ చేసిన ఆరోపణను భారత్ తిప్పికొట్టింది. జెనీవాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి...
- పాక్పై ఐరాస హక్కుల వేదికపై భారత్ ఆరోపణ
జెనీవా, సెప్టెంబరు 28: భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన తారస్థాయిలో ఉందంటూ పాకిస్థాన్ చేసిన ఆరోపణను భారత్ తిప్పికొట్టింది. జెనీవాలో ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలి (యూఎన్హెచ్చార్సీ) 45 వ సర్వసభ్య సమావేశాల్లో మాట్లాడిన సీనియర్ దౌత్యవేత్త, భారత మిషన్ ఫస్ట్ సెక్రటరీ పవన్ బుధే- ‘పాక్లో మత స్వేచ్ఛ గురించి మాట్లాడితే తల నరికేస్తున్నారు.మతపరమైన, జాతిపరమైన మైనారిటీల భవిత అంధకారమే’ అని తీవ్రంగా విమర్శించారు.