పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు చట్ట ఉల్లంఘనే: కేఆర్‌ఎంబీ

ABN , First Publish Date - 2020-07-12T07:06:30+05:30 IST

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతినివ్వడం చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) స్పష్టం చేసింది...

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపు చట్ట ఉల్లంఘనే: కేఆర్‌ఎంబీ

న్యూఢిల్లీ, జూలై 11 (ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంపునకు రాయలసీమ ఎత్తిపోతల పథకం పేరిట ఏపీ ప్రభుత్వం కొత్త ప్రాజెక్టుకు పరిపాలనాపరమైన అనుమతినివ్వడం చట్టాన్ని ఉల్లంఘించినట్టేనని కృష్ణా నది యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ) స్పష్టం చేసింది. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిందని తెలిపింది. అపెక్స్‌ కౌన్సిల్‌ నుంచి అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టు చేపట్టడం రాష్ట్ర విభజన చట్టంలోని సెక్షన్‌ 84, 11వ షెడ్యూల్‌లో 7వ పేరాను ఉల్లఘిస్తుందని తేల్చిచెప్పింది. ఈ ప్రాజెక్టు చేపట్టడంపై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి ప్రధాని కార్యాలయానికి గతంలో ఫిర్యాదు చేయగా.. కేఆర్‌ఎంబీ సభ్యుడు హరికేశ్‌ మీనా బదులిచ్చారు. 


Updated Date - 2020-07-12T07:06:30+05:30 IST