కరోనాతో పోలీసు ఐజీ మృతి
ABN , First Publish Date - 2020-10-19T12:20:46+05:30 IST
బీహార్ రాష్ట్రంలో కరోనా వైరస్తో ఓ సీనియర్ పోలీసు అధికారి మరణించిన ఘటన తాజాగా వెలుగుచూసింది....

పట్నా (బీహార్): బీహార్ రాష్ట్రంలో కరోనా వైరస్తో ఓ సీనియర్ పోలీసు అధికారి మరణించిన ఘటన తాజాగా వెలుగుచూసింది. బీహార్ లోని పూర్ణియా రేంజ్ ఇన్స్పెక్టరు జనరల్ (ఐజీ) వినోద్ కుమార్ (59) కరోనాతో మరణించారు. మధుమేహంతోపాటు బీపీ ఉన్న వినోద్ కుమార్ కు కరోనా సోకడంతో పట్నా ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించాడని కొవిడ్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సంజీవకుమార్ చెప్పారు. ఐజీతోపాటు నలంద, ముజాఫ్పర్ పూర్, గయ ప్రాంతాల్లో మరో ముగ్గురు కరోనా రోగులు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ మరణించారు. కరోనాతో మరణించిన ఐజీ వినోద్ కుమార్ 1986లో పోలీసు శాఖలో చేరి, 2001లో ఐపీఎస్ సాధించారు. బీహార్ రాష్ట్రంలో ఆదివారం కరోనాతో ఆరుగురు మరణించారు. బీహార్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 2,04,212 కి చేరింది.