ప్రజలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పాక్ ప్రధాని!

ABN , First Publish Date - 2020-04-05T23:53:47+05:30 IST

కరోనాకు మనల్ని ఏమీ చేయలేదు అనే భావం ఏమాత్రం మించిది కాదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ ప్రజలకు హెచ్చరించారు.

ప్రజలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పాక్ ప్రధాని!

ఇస్లామాబాద్: కరోనా మహమ్మారి మనల్ని ఏమీ చేయలేదు అనే భావం ఏమాత్రం మంచిది కాదని పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ దేశ ప్రజలను హెచ్చరించారు. పంజాబ్ ప్రావిన్స్‌లో వేయ్యికి పైగా కరోనా కేసుల నమోదైన నేపథ్యంలో ఇమ్రాన్ ఆ ప్రాంతంలో పర్యటించారు. కరోనా కట్టడి కోసం అక్కడి అధికారులు చేపడుతున్న పరీశీలించిన అనంతరం.. అక్కడ తత్కాలికంగా ఏర్పాటు చేసిన కరోనా ఆస్పత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రసంగించిన ఇమ్రాన్.. కరోనా విషయంలో ఏమాత్రం అలసత్వం ప్రదర్శించవద్దంటూ ప్రజలను గట్టిగా హెచ్చరించారు. ‘కరోనా మాకు సోకదనే తప్పుడు అభిప్రాయం ఎవ్వరికీ ఉండకూడదు. ధనవంతులు నివశించే న్యూయార్క్ పరిస్థితి ఏమైందో చూడండి. కరోనా ప్రళయం ఎప్పటికి అంతమవుతుందో నాతో సహా ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు’ అని ఆయన సూటిగా చెప్పి ముగించారు. ఇక పాక్ లో మొత్తం కరోనా కేసులు సంఖ్య 2800 దాటిపోయిన విషయం తెలిసిందే.  

Updated Date - 2020-04-05T23:53:47+05:30 IST