నిత్యావసరాల షాపులు తెరిస్తే ఇక లాక్ డౌన్ ఎక్కడ?.. సీఎం వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-03-27T17:44:13+05:30 IST

చాపకింద నీరులా దేశంలో వ్యాపిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. కానీ నిత్యావసరాలకు సంబంధించిన...

నిత్యావసరాల షాపులు తెరిస్తే ఇక లాక్ డౌన్ ఎక్కడ?.. సీఎం వ్యాఖ్యలు

పనాజీ: చాపకింద నీరులా దేశంలో వ్యాపిస్తున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించింది. కానీ నిత్యావసరాలకు సంబంధించిన షాపులు మాత్రం తెరిచి ఉంటాయని తెలిపింది. ఈ విషయంలో గోవా ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించి నిత్యావసరాల షాపులు కూడా తెరవకూడదని ఆదేశించింది. దీంతో ఇక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తంచేశారు.

మిగతా రాష్ట్రాల్లో నిత్యావసరాలకు సంబంధించిన షాపులన్నీ తెరుస్తుంటే, గోవాలో మాత్రం నిషేధం ఎందుకు అంటూ ధ్వజమెత్తారు. దీంతో ఎట్టకేలకు పాలు, ఇతర నిత్యావసరాలకు సంబంధించిన షాపులు తెరవడానికి గోవా సీఎం ప్రమోద్ సావంత్ అనుమతులిచ్చారు. అయితే ఈ నిత్యావసరాల షాపులు తెరిస్తే, 90శాతం గోవాను ఓపెన్ చేసినట్లేనని ప్రమోద్ అభిప్రాయపడ్డారు. ఇక లాక్ డౌన్ ఎక్కడిది? అని ప్రశ్నించారు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఆందోళనగా ఉందన్నారు.

Updated Date - 2020-03-27T17:44:13+05:30 IST