అవినీతి సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటా: మమతా

ABN , First Publish Date - 2020-05-13T21:07:32+05:30 IST

బుధవారం అధికారులతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మమతా మాట్లాడుతూ ‘‘మా ప్రభుత్వానికి ఆర్థిక మరకలు అంటుకోలేదు. నిష్పాక్షిక పాలన అందించడానికే మా ప్రయత్నం అంతా

అవినీతి సమాచారం ఇస్తే చర్యలు తీసుకుంటా: మమతా

కోల్‌కతా: పాలన విషయంలో అవినీతికి సంబంధించి ఒక్క ఫిర్యాదు ఇచ్చినా చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి తాను సిద్ధంగా ఉన్నట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అన్నారు. తమ ప్రభుత్వంలో హవాలాకు తావు లేదని, అవకతవకలు లేకుండా పాలన సాగిస్తున్నట్లు ఆమె చెప్పుకొచ్చారు. బెంగాల్ అభివృద్ధి కోసమే తాము పని చేస్తున్నామని మమతా పేర్కొన్నారు.


బుధవారం అధికారులతో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మమతా మాట్లాడుతూ ‘‘మా ప్రభుత్వానికి ఆర్థిక మరకలు అంటుకోలేదు. నిష్పాక్షిక పాలన అందించడానికే మా ప్రయత్నం అంతా. అవినీతికి సంబంధించి ప్రజల నుంచి ఒక్క ఫిర్యాదు వచ్చినా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అలాగే రేషన్ పంపిణీలో ప్రభుత్వ పథకాలకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదునూ నేను వినాలనుకోవడం లేదు. మా సంకల్పం బెంగాల్‌ను ముందుకు తీసుకు వెళ్లడమే’’ అని అన్నారు.

Updated Date - 2020-05-13T21:07:32+05:30 IST