కేంద్రానికి ఐసీఎంఆర్ సూచన
ABN , First Publish Date - 2020-04-10T08:42:58+05:30 IST
దేశంలో తీవ్రమైన శ్వాసకోస సమస్యలను ఎదుర్కొంటున్న 40 శాతం కరోనా పాజిటివ్ కేసుల్లో పాజిటివ్ వ్యక్తిని...
న్యూఢిల్లీ, ఏప్రిల్ 9: దేశంలో తీవ్రమైన శ్వాసకోస సమస్యలను ఎదుర్కొంటున్న 40 శాతం కరోనా పాజిటివ్ కేసుల్లో పాజిటివ్ వ్యక్తిని కలిసిన లేదా విదేశీయానం చేసిన చరిత్ర లేదని భారత ఆరోగ్య సంస్థ (ఐసీఎంఆర్) చేసిన ఓ అధ్యయనంలో వెల్లడయింది. ఈ కేసులన్నీ మొత్తం 15 రాష్ట్రాల్లోని 36 జిల్లాల్లో నమోదయ్యాయని తేలింది. ఈ ప్రాంతాలకు అత్యంత ప్రాధాన్యతనిచ్చి తక్షణం నియంత్రణ చర్యలు చేపట్టాలని ఐసీఎంఆర్.. కేంద్రానికి సూచించింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా నమోదైన పాజిటివ్ కేసుల్లో 104 మంది తీవ్రమైన శ్వాసకోస సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో 40 మందికి ఈ వైరస్ ఎలా సోకిందో అంతుచిక్కడం లేదని ఐసీఎంఆర్ తెలిపింది.