కరోనా పేషెంట్లున్న హోటల్.. కుప్ప కూలిపోవడంతో..
ABN , First Publish Date - 2020-03-08T21:24:07+05:30 IST
చైనాలో కరోనా బాధితులను ఉంచి క్వారంటైన్ చేసిన ఓ హోటల్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఆరుగురు దుర్మరణం పాలయ్యారు.

బీజింగ్: చైనాలో కరోనా బాధితులను ఉంచి క్వారంటైన్ చేసిన ఓ హోటల్ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇప్పటికే ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషయాన్ని చైనాలోని విపత్తు నిర్వహణ శాఖ అధికారులు వెల్లడించారు. హోటల్ శిధిలాల కింద చిక్కుకున్న 37 మందిని ఇప్పటికే రక్షించామని, ఇంకా 28 మంది శిధిలాల కిందే ఉన్నట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే 750 మంది రెస్క్యూ సిబ్బంది, 20 అంబులెన్సులు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. శిధిలాల కింద చిక్కుకొని ఉన్న 28 మందిని కాపాడటానికి వీరు ప్రయత్నిస్తున్నారు.