బీజేపీ ఎంపీపై జార్ఖండ్ సీఎం పరువునష్టం దావా

ABN , First Publish Date - 2020-10-03T14:15:45+05:30 IST

తనపై అత్యాచారం ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాంచీ కోర్టులో రూ.300 కోట్లకు పరువు నష్టం దావా వేశారు....

బీజేపీ ఎంపీపై జార్ఖండ్ సీఎం పరువునష్టం దావా

తనపై అత్యాచార ఆరోపణలు చేశారని...

రాంచీ (జార్ఖండ్): తనపై అత్యాచారం ఆరోపణలు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబేపై జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాంచీ కోర్టులో రూ.300 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. గొడ్డా పార్లమెంటు సభ్యుడు దూబే జులై 27-29 తేదీల మధ్య సీఎం సోరెన్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. 2013లో ముంబై దిగువ కోర్టులోతనపై ఓ మహిళ దాఖలు చేసిన లైంగిక వేధింపుల కేసు గురించి తనకు తెలియదని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కోర్టుకు తెలిపారు. 


సోరెన్ తనపై నమోదైన లైంగిక వేధింపుల కేసును పరిష్కరించడానికి తన కార్యాలయాన్ని దుర్వినియోగం చేశారని ఎంపీ దూబే ఆరోపించారు. సీఎంపై ఇలాంటి ఆరోపణలు రావడం ప్రజాస్వామ్యానికి సిగ్గుచేటు అని, దీనిపై ముంబై పోలీసులు తిరిగి దర్యాప్తు చేయాలని ఎంపీ దూబే జులై 29న ట్వీట్ చేశారు.ఎంపీ దూబేతో కలిసి ముగ్గురిపై రూ.300 కోట్లకు సీం సోరెన్ పరువునష్టం దావా వేశారు.

Updated Date - 2020-10-03T14:15:45+05:30 IST