హ్యాండ్‌ శానిటైజర్ల కోసం మిగులు బియ్యం

ABN , First Publish Date - 2020-04-21T10:20:38+05:30 IST

కరోనా వ్యాప్తి నేపథ్యంలో చేతులను శుభ్రంగా ఉంచుకోవడానికి హ్యాండ్‌ శానిటైజర్లను విపరీతంగా వినియోగిస్తున్నారు.

హ్యాండ్‌ శానిటైజర్ల కోసం మిగులు బియ్యం

ఎథనాల్‌ తయారీకి కేంద్రం అనుమతి


న్యూఢిల్లీ:  కరోనా వ్యాప్తి నేపథ్యంలో చేతులను శుభ్రంగా ఉంచుకోవడానికి  హ్యాండ్‌ శానిటైజర్లను విపరీతంగా వినియోగిస్తున్నారు. ఫలితంగా వీటికి కొరత ఏర్పడుతోంది. దీన్ని గుర్తించిన ప్రభుత్వం హ్యాండ్‌ శానిటైజర్లకు అవసరమైన ఎథనాల్‌ తయారీ కోసం గోదాములు, కర్మాగారాల్లో ఉన్న మిగులు బియ్యం నిల్వలను వినియోగించేందుకు అనుమతిచ్చింది. అయితే దీనికి నేషనల్‌ బయో ఫ్యూయల్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (ఎన్‌బీసీసీ) అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సోమవారంనాడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మిగులు ఆహార నిల్వలను అల్కహాల్‌ ఆధారిత హ్యాండ్‌ శానిటైజర్ల తయారీకి అవసరమైన ఎథనాల్‌ కోసం వినియోగించాలని నిర్ణయించారు. అయితే ఈ నిర్ణయంపై కొన్ని విమర్శలు వినిపిస్తున్నాయి. ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా గోదాముల్లో నిల్వలున్నా అనేక మందికి బియ్యం, గోధుమలు అందడం లేదంటున్నారు.

Updated Date - 2020-04-21T10:20:38+05:30 IST