కరోనా నుండి కాపాడుకునేందుకు సరి- బేసి విధానం
ABN , First Publish Date - 2020-04-09T11:34:58+05:30 IST
కరోనా వ్యాప్తిని నివారించేందుకు హరియాణాలోని గురుగ్రామ్ పరిపాలన విభాగం ఆడ్-ఈవెన్ విధానాన్ని ఆశ్రయించింది. ఈ విధంగా సామాజిక దూరం పాటించడం సాధ్యం అవుతుందని భావిస్తోంది.
గురుగ్రామ్: కరోనా వ్యాప్తిని నివారించేందుకు హరియాణాలోని గురుగ్రామ్ పరిపాలన విభాగం ఆడ్-ఈవెన్ విధానాన్ని ఆశ్రయించింది. ఈ విధంగా సామాజిక దూరం పాటించడం సాధ్యం అవుతుందని భావిస్తోంది. ఈ నియమం ఈరోజు నుండి అమలులోకి వస్తుంది. గురుగ్రామ్ మార్కెట్ కమిటీ చైర్మన్ మాట్లాడుతూ మార్కెట్లో పెరుగుతున్న రద్దీని దృష్టిలో ఉంచుకుని సరి- బేసి విధానాన్ని అనుసరించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ 119 పెద్ద, 58 చిన్న దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాల నంబర్లను అనుసరించి వాటిని తెరుస్తారు. కాగా అతిపెద్ద మార్కెట్లో లాక్డౌన్ నియమాలను ఉల్లంఘించిన నేపథ్యంలో పలువురికి చలానాలు వడ్డించారు. ఈ నేపధ్యంలోనే ఈ సరికొత్త నిర్ణయం తీసుకున్నారు.