కరోనా రిపోర్ట్: గుజరాత్‌ 28వేలకు చేరువగా కేసులు

ABN , First Publish Date - 2020-06-23T01:36:04+05:30 IST

గుజరాత్‌లో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతి రోజూ నమోదయ్యే కేసుల సంఖ్య కూడా ఏరోజుకారోజు...

కరోనా రిపోర్ట్: గుజరాత్‌ 28వేలకు చేరువగా కేసులు

గాంధీనగర్: గుజరాత్‌లో కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతి రోజూ నమోదయ్యే కేసుల సంఖ్య కూడా ఏరోజుకారోజు పెరుగుతోంది. నేడు దాదాపు 560కి పైగా కేసులు రాష్ట్రంలో నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 28వేలకు చేరువైంది. ఈ మేరకు ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 563 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 21 మంది మరణించారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 27,880కు చేరింది. వీరిలో 26,278మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 19,917మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 1,685మంది ప్రాణాలు కోల్పోయారు.


Updated Date - 2020-06-23T01:36:04+05:30 IST