గుజరాత్ పెరిగిన కరోనా కేసులు, మరణాలు

ABN , First Publish Date - 2020-08-02T01:46:53+05:30 IST

గుజరాత్ పెరిగిన కరోనా కేసులు, మరణాలు

గుజరాత్ పెరిగిన కరోనా కేసులు, మరణాలు

గాంధీనగర్: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. అయినప్పటికీ రోజురోజుకూ గుజరాత్ రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. శనివారం సాయంత్రం నాటికి అందిన సమాచారం మేరకు గుజరాత్ రాష్ట్రంలో కొత్తగా 1,136 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య శాఖ తెలిపింది. కరోనా వల్ల ఇవాళ 24 మంది మృతి చెందగా, కోవిడ్ వల్ల మొత్తం 2,465 మంది మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 62,574 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు ప్రభుత్వం పేర్కొంది. కరోనా నుంచి కోలుకొని 45,782 మంది డిశ్చార్జ్ అవగా, ప్రస్తుతం 14,327 మంది కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్నట్లు గుజరాత్ ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2020-08-02T01:46:53+05:30 IST