కరోనా రిపోర్ట్: గుజరాత్లో 500కు పైగా కరోనా కేసులు
ABN , First Publish Date - 2020-06-19T03:15:05+05:30 IST
గుజరాత్లో నేడు 500కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 26,000కు...
గాంధీనగర్: గుజరాత్లో నేడు 500కు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసులు 26,000కు చేరువయింది. తాజా కేసులకు సంబంధించి రాష్ట్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా గత 24 గంటల్లో 510 కోవిడ్-19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 31 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజాగా నమోదైన కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 25,660కి చేరింది. వీరిలో 6,408మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా 17,829మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. 1,592 మంది ప్రాణాలు కోల్పోయారు.