ఏపీకి జీఎస్టీ నిధులు 1055 కోట్లు

ABN , First Publish Date - 2020-12-15T09:17:26+05:30 IST

రాష్ట్రాలకు వస్తు సేవల పన్ను(జీఎస్టీ) లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఏడో విడత రూ.6,000 కోట్లను సోమవారం విడుదల చేసింది.

ఏపీకి జీఎస్టీ నిధులు 1055 కోట్లు

న్యూఢిల్లీ, డిసెంబరు 14(ఆంధ్రజ్యోతి): రాష్ట్రాలకు వస్తు సేవల పన్ను(జీఎస్టీ) లోటును భర్తీ చేసేందుకు కేంద్ర ఆర్థిక శాఖ ఏడో విడత రూ.6,000 కోట్లను సోమవారం విడుదల చేసింది. ఈ నిధుల్లో 23 రాష్ర్టాలకు రూ.5,516.6 కోట్లు, ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌, పుదుచ్చేరికి రూ.483.4 కోట్లు, ఏపీకి 1,055.79 కోట్లు, తెలంగాణకు .559.02కోట్లు విడుదల చేసినట్లు పేర్కొంది. 

Updated Date - 2020-12-15T09:17:26+05:30 IST