బిల్డర్కు రూ. 5 లక్షల జరిమానా విధించిన పీసీబీ
ABN , First Publish Date - 2020-12-31T01:01:16+05:30 IST
బిల్డర్కు రూ. 5 లక్షల జరిమానా విధించిన పీసీబీ
నోయిడా: కాలుష్య నియంత్రణ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ నోయిడాలోని ఒక ప్రైవేట్ బిల్డర్కు కాలుష్య నియంత్రణ నిబంధనలను పాటించనందుకు రూ. 5 లక్షల జరిమానా విధించినట్లు యూపీపీసీబీ పేర్కొంది.
ఇది ఉద్గారాలకు దారితీస్తుందని, తద్వారా మొత్తం వాయు కాలుష్యానికి దోహదం చేస్తుందని ఉత్తర ప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. నిర్మాణ సామగ్రి బహిరంగ ప్రదేశంలో ఉన్నట్లు కనుగొనబడిందని, తగినంత ధూళి మరియు కాలుష్య నియంత్రణ చర్యలు తీసుకోలేదని యూపీపీసీబీ వెల్లడించింది.