రాష్ట్రానికి మిడతల బెడద లేదు: మంత్రి వెల్లడి
ABN , First Publish Date - 2020-06-01T15:03:47+05:30 IST
రాష్ట్రానికి మిడతల బెడద ఉండదని, రైతులు నిశ్చింతగా వుండొచ్చని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఆర్.కామరాజ్ పేర్కొన్నారు. తిరువారూర్లో ఆయన పలు
చెన్నై: రాష్ట్రానికి మిడతల బెడద ఉండదని, రైతులు నిశ్చింతగా వుండొచ్చని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఆర్.కామరాజ్ పేర్కొన్నారు. తిరువారూర్లో ఆయన పలు ప్రాంతాల్లో ఉన్న రేషన్ దుకాణాలను పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ, అన్ని కుటుంబకార్డులకు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించిన విధంగా రేషన్ సరుకులను ఉచితంగా పంపిణీ చేసేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్టు తెలిపారు. రేషన్ దుకాణాల వద్ద భౌతిక దూరాన్ని పాటిస్తూ. తేది ప్రకారం టోకెన్లు ఉన్న వారికి సరుకుల వినియోగం ఉంటుందన్నారు. ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రాష్ట్రానికి మిడతల బెడద వుంటుందని కథనాలు వస్తున్నాయని, ముఖ్యంగా రైతులు ఇలాంటి వదంతులకు ఆందోళన చెందరాదన్నారు. మిడతల దండు రాష్ట్రంలో ప్రవేశించే ఛాయలు లేవని, అయినా పనిగట్టుకొని అసత్య వార్తలు ప్రచారం చేయడం సరికాదని మంత్రి సూచించారు.