ఓటేసిన బీహార్ గవర్నర్ ఫాగు చౌహాన్
ABN , First Publish Date - 2020-11-03T13:13:41+05:30 IST
బీహార్ రాష్ట్ర గవర్నరు ఫాగు చౌహాన్ మంగళవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు ...
పట్నా (బీహార్): బీహార్ రాష్ట్ర గవర్నరు ఫాగు చౌహాన్ మంగళవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పట్నా నగరంలోని దిఘా ప్రభుత్వ పాఠశాలలోని పోలింగ్ కేంద్రానికి వచ్చిన గవర్నర్ చౌహాన్ ఓటు వేశాక బయటకు వచ్చి మీడియాకు తన చేతి వేలికి ఉన్న నల్ల సిరా చుక్కను చూపించారు. ‘‘ప్రజలు పెద్దసంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటేయాలి, గతంలో కంటే పోలింగు శాతం పెరుగుతుందని నేను భావిస్తున్నాను’’ అని గవర్నరు చౌహాన్ వ్యాఖ్యానించారు. కరోనా బారిన పడి కోటుకున్న బీహార్ డిప్యూటీ సీఎం సుశీల్ కుమార్ మోదీ మంగళవారం రాజేంద్రనగర్ లోని సెయింట్ జోసెఫ్ ఉన్నత పాఠశాలలోని 49వ పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఓటర్లు మాస్కులు ధరించి, సామాజిక దూరం పాటిస్తూ ఓటింగులో పాల్గొనాలని సుశీల్ మోదీ సూచించారు.