కొబ్బరి రైతులకు స్వీట్ న్యూస్... మద్దతు ధర పెంపు
ABN , First Publish Date - 2020-06-24T02:27:17+05:30 IST
కొబ్బరి రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి వార్తనందించింది. కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. క్వింటాలు కొబ్బరికాయల కనీస మద్దతు ధరను రూ. 2,571 నుంచి రూ. 2,700 లకు పెరిగింది. అంటే... క్వింటాలుకు రూ. 129 మేర పెరిగింది. కాగా ఎండు కొబ్బరికి సంబంధించి కూడా కనీస మద్దతు ధరను పెంచిన విషయం విదితమే.