కొబ్బరి రైతులకు స్వీట్ న్యూస్... మద్దతు ధర పెంపు

ABN , First Publish Date - 2020-06-24T02:27:17+05:30 IST

కొబ్బరి రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి వార్తనందించింది. కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. క్వింటాలు కొబ్బరికాయల కనీస మద్దతు ధరను రూ. 2,571 నుంచి రూ. 2,700 లకు పెరిగింది. అంటే... క్వింటాలుకు రూ. 129 మేర పెరిగింది. కాగా ఎండు కొబ్బరికి సంబంధించి కూడా కనీస మద్దతు ధరను పెంచిన విషయం విదితమే.

కొబ్బరి రైతులకు స్వీట్ న్యూస్... మద్దతు ధర పెంపు

న్యూఢిల్లీ : కొబ్బరి రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి వార్తనందించింది. కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. క్వింటాలు కొబ్బరికాయల కనీస మద్దతు ధరను రూ. 2,571 నుంచి రూ. 2,700 లకు పెరిగింది. అంటే... క్వింటాలుకు రూ. 129 మేర పెరిగింది. కాగా ఎండు కొబ్బరికి సంబంధించి కూడా కనీస మద్దతు ధరను పెంచిన విషయం విదితమే.

గతంలో రూ. 9521 గా ఉన్న కొబ్బరి చిప్పల ధర... ఆ పెంపుతో రూ. 9,960 కి చేరింది. కాగా ఎండు కొబ్బరి(బాల్స్) ధర కూడా రూ. 9,920 నుంచి రూ. 10,300 లకు పెరిగింది. 

Updated Date - 2020-06-24T02:27:17+05:30 IST