రైలులో వ‌చ్చిన ఏడుగురికి క‌రోనా పాజిటివ్‌... గోవాలో పెరుగుతున్న క‌రోనా కేసులు!

ABN , First Publish Date - 2020-05-18T15:29:47+05:30 IST

దేశంలో కరోనా వైరస్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 90 వేల మార్కును దాటింది. అయితే కరోనా కేసులు అంత‌గా న‌మోదు‌కాని గోవాలో కొత్త కేసులు చోటుచేసుకున్నాయి.

రైలులో వ‌చ్చిన ఏడుగురికి క‌రోనా పాజిటివ్‌... గోవాలో పెరుగుతున్న క‌రోనా కేసులు!

పూణె: దేశంలో కరోనా వైరస్ కేసులు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. మొత్తం కరోనా బాధితుల సంఖ్య 90 వేల మార్కును దాటింది. అయితే కరోనా కేసులు అంత‌గా న‌మోదు‌కాని గోవాలో కొత్త కేసులు చోటుచేసుకున్నాయి. ముంబై నుంచి రైలులో గోవాకు వచ్చిన ఏడుగురు ప్ర‌యాణికులకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు గుర్తించారు. దీంతో గోవాలో యాక్టివ్‌ కేసుల సంఖ్య 29 మార్కును దాటింది. ముంబై నుంచి గోవాకు రైలులో వచ్చిన సుమారు 100 మందికి కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. కాగా ప్రస్తుతం దేశంలోని పదిహేను నగరాలకు ఢిల్లీ నుంచి రైళ్లు న‌డుస్తున్నాయి. గోవా ప్రభుత్వం ఇటీవ‌లే త‌మ రాష్ట్రాన్ని కరోనా రహితంగా ప్రకటించింది. తాజాగా కేసులు న‌మోదు కావ‌డంతో రాష్ట్ర ప్రభుత్వం ఆందోళ‌న వ్య‌క్తం చేస్తోంది. 

Updated Date - 2020-05-18T15:29:47+05:30 IST