భారత్ బంద్‌కు ముందే నోయిడాలో సెక్షన్ 144... ధర్నాలు నిషేధం!

ABN , First Publish Date - 2020-12-07T11:59:08+05:30 IST

దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనల మధ్య గౌతమబుద్ధ నగర్‌లో సెక్షన్ 144 అమలు చేశారు.

భారత్ బంద్‌కు ముందే నోయిడాలో సెక్షన్ 144... ధర్నాలు నిషేధం!

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో రైతుల ఆందోళనల మధ్య గౌతమబుద్ధ నగర్‌లో సెక్షన్ 144 అమలు చేశారు. గౌతమబుద్ధ నగర్ పరిపాలనా విభాగం కరోనా మహమ్మారి కట్టడి పేరుతో సెక్టన్ 144ను అమలు చేసింది. ఇది 2021, జనవరి 2 వరకూ కొనసాగనుంది. దీంతో గౌతమబుద్ధ నగర్‌లో ఎటువంటి సామూహిక కార్యక్రమాలు చేసేందుకు అవకాశం లేదు.


రైతులు ఈనెల 8న భారత్ బంద్ తలపెట్టిన నేపధ్యంలో గౌతమబుద్ధ నగర్ పరిపాలనా అధికారులు అప్రమత్తమై, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబరు 23న దివంగత మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ జయంతి, 25న క్రిస్మస్, 31న సంవత్సరం చివరి రోజు, జనవరి 1న నూతన సంవత్సర వేడుకలు ఇలా పలు కార్యక్రమాలు ఉన్న దృష్ట్యా సామూహిక వేడుకలు నిర్వహిస్తుంటారు. అయితే కరోనా కాలంలో వీటిని నిర్వహించకుండా ఉండేందుకు పరిపాలనా అధికారులు ముందుగానే సెక్షన్ 144 విధించారు. 

Updated Date - 2020-12-07T11:59:08+05:30 IST