బాలికపై సామూహిక అత్యాచారం.. ఆపై హత్య... హింసతో అట్టుడుకుతోన్న బెంగాల్
ABN , First Publish Date - 2020-07-20T01:51:08+05:30 IST
కోల్కతా: పశ్చిమబెంగాల్ ఉత్తర దినాజ్పూర్ కాలాగాచ్ ప్రాంతంలో 16 సంవత్సరాల బాలికపై అత్యాచారం, ఆపై హత్య జరిగింది. దీంతో బాధితురాలి కుటుంబీకులు, గ్రామస్థులు న్యాయం కోసం రోడ్డెక్కారు.

కోల్కతా: పశ్చిమబెంగాల్ ఉత్తర దినాజ్పూర్ కాలాగాచ్ ప్రాంతంలో 16 సంవత్సరాల బాలికపై అత్యాచారం, ఆపై హత్య జరిగింది. దీంతో బాధితురాలి కుటుంబీకులు, గ్రామస్థులు న్యాయం కోసం రోడ్డెక్కారు. దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆందోళన హింసాత్మకంగా మారింది. పలు వాహనాలకు ఆందోళనకారులు నిప్పుబెట్టారు. ఆందోళనకారులను అదుపుచేసేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు.
బాధితురాలు స్థానిక బీజేపీ బూత్ ప్రెసిడెంట్ సోదరి అని పశ్చిమబెంగాల్ బీజేపీ రాష్ట్ర శాఖ తెలిపింది. మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో బాలికలకు రక్షణ లేకుండాపోయిందని బీజేపీ విమర్శించింది.
హింస నేపథ్యంలో దినాజ్పూర్ ప్రాంతంలో భారీగా పోలీసులను మోహరించారు.